ప్రిన్స్ మహేశ్ బాబు, కృతి సనన్ నటించిన '1' నేనొక్కడినే చిత్రం ఆడియోను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానుల సందడితో శిల్ప కళావేదికలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా ఆవిష్కరించారు.
సాధారణంగా మహేష్ మితభాషి. గట్టిగా నాలుగు మాటలు మాట్లాడడు. అలాంటిది నేనొక్కడినే అడియో ఫంక్షన్ లో నాలుగు ముక్కలు ఎక్కువే మాట్లాడాడు. దానికే అభిమానులు ఫిదా అయిపోయారు. తన ప్రసంగంలో మహేష్ పేరుపేరునా, చాలా మందికి కృతజ్ఞతలు తెలిపాడు. పాటలు రాసిన చంద్రబోస్, ఫైట్లు రూపొందించిన పీటర్ హెయిన్స్ తదితరులతో సహా. ఇక అభిమానులకైతే ఏకంగా చేతులెత్తి దండం పెట్టేసాడు. ఇంతకన్నా ఏమిచ్చి రుణం తీర్చుకోగలనంటూ.పనిలో పనిగా సినిమా విజయం మీమీదే వుందంటూ బాధ్యత అప్పగించేసాడు. మొత్తానికి మహేష్ స్పీచ్ అభిమానులకు మా బాగా నచ్చేసింది.
దేవితో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ చక్కటి సంగీతాన్ని అందించారు. నా జీవితంలో వన్ చిత్రం గొప్ప చిత్రం అవుతుంది. షూటింగ్ లో పీటర్ బిల్డింగ్ ల మీద నుంచి దూకించాడు. డ్యాన్సులు చేయడం లేదని కొద్దికాలంగా అభిమానులు బాధపడుతున్నారని..ఈ చిత్రంలో ఆ బాధను ప్రేమ్ రక్షిత్ తీర్చాడు అని మహేశ్ అన్నారు. ట్రైలర్ డిసెంబర్ 25 తేదిన విడుదల చేస్తున్నామని మహేశ్ తెలిపారు.
0 comments