రామ్ చరణ్, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా అపూర్వలిఖియా దర్శకత్వంలో రూపొందిన చిత్రం జంజీర్. దీనిని తెలుగులో తుఫాన్గా రిలీజ్ చేస్తున్నారు. హీందీ జంజీర్, తెలుగు తుఫాన్ సినిమాలను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు.
ఈ నేపధ్యంలో తుఫాన్ సినిమాను అటు సమైక్యవాదులు, ఇటు తెలంగాణ వాదులు అడ్డుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రనిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. దానికి హైకోర్టు ఈ సినిమాకు బధ్రత కల్పించాలని, థియేటర్లలలో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చేయాలని పోలీసులకు ఆదేశించింది.
దీంతో ఊపిరిపీల్చుకున్న రామ్ చరణ్ కు ఇప్పుడు మల్లీ సమస్యలు వచ్చాయి. తిరుపతి, పలమనేరు ప్రాంతంలో ఈ సినిమాను తమ థియేటర్లలలో విడుదల చేయమని థియేటర్ల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. తిరుపతిలో సమైక్యవాదులు, విదార్థి జేఏసీ నాయకులు థియేటర్ల యాజమాన్యాలతో సంప్రదించి తుఫాన్ సినిమాను నిలిపివేయాలని కోరగా వారు దీనికి మద్దతు తెలిపారు.
తాము కూడా సమైక్యాంధ్రాకు మద్దతుతెలుపుతామని అందుకే తుఫాన్ సినిమాను తమ థియేటర్లలో ఆడించే ప్రసక్తే లేదని తిరుపతి, పలమనేరు థియేటర్ల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో రామ్ చరణ్ తుఫాన్ సినిమాకు తిరుపతి, పలమనేరులో బ్రేకులు పడ్డట్లు అయ్యింది.
0 comments